Telangana Young Voters: తెలంగాణలో యంగ్ తరంగ్. రికార్డు స్థాయిలో పెరగనున్న ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కొత్తగా ప్రవేశపెట్టిన రూలే దీనికి కారణం. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవాళ్లు మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు 17 సంవత్సరాలు నిండినవాళ్లు కూడా అడ్వాన్స్గా అప్లై చేసుకునేందుకు ఈసీఐ ఛాన్స్ ఇచ్చింది. 2023 ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 నిండబోయేవాళ్లు ముందుగానే అంటే 2022 ఆగస్టు ఒకటి నుంచి ఎన్రోల్ అవటానికి అనుమతించింది. 2023 వార్షిక ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండటంతో ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారి పేర్లను తదుపరి ఓటర్ల ముషాయిదా జాబితాలో చేరుస్తారు.
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
Woman Statue: ఈ విగ్రహమేంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఎన్నో విశేషాలు దీని సొంతం.
కొత్త యువ ఓటర్ల నమోదును పెంచేందుకు ఈసీఐ చేపడుతున్న చర్యలకు తాజాగా తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం బాగా ఉపకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2022 జనవరిలో ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య 3.03 కోట్లు. 2021 నవంబర్ నుంచి చేపట్టిన ‘స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్)-2022’ అనంతరమే ఈ లిస్టును ఈసీఐ విడుదల చేసింది.
అయితే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాల్సిన యువత సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్లు గ్రహించిన ఈసీఐ అనూహ్య నిర్ణయాన్ని వెలువరించింది. గతంలో ఓటర్ల లిస్టును ఏటా జనవరి ఫస్టున అప్డేట్ చేసేవాళ్లు. దీంతో ఈలోపే ఏదైనా ఎలక్షన్ జరిగితే నవ యువకులు ఓటేసేందుకు వీల్లేకుండాపోయేది. ఈసీఐ అమలుచేయనున్న నూతన నిర్ణయం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు కొత్తగా 2 లక్షల 27 వేల 226 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
అదే సమయంలో దాదాపు అదే సంఖ్యలో(2 లక్షల 26 వేల 997 మంది) ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. చనిపోయిన, వేరే రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లను తెలంగాణ జాబితా నుంచి తీసేశారు. ఒక ఓటర్కి ఒకటికి మించి ఉన్న కార్డులను గుర్తించటానికి ఈసీఐ సాఫ్ట్వేర్ సాయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనిఖీలు చేపట్టింది.
ఈవిధంగా 22.04 లక్షల డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నట్లు తేల్చింది. అనంతరం 10 లక్షల 25 వేల 987 మంది ఓటర్ల పేర్లను కొట్టేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో 43 లక్షల 67 వేల 20 మంది ఓటర్లతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఏడు జిల్లాల్లో కనీసం 10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..