Telangana : తెలంగాణాలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ఐదుగురు యువకులు మృతి..
ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు..
వీటిలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా, ఒకరు సంగారెడ్డి లో చనిపోయారు.. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లోని తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ కుమారుడు ఆకాష్గా గుర్తించారు.. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవాసాత్తు కిందపడి మరణించారు..
Also Read
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
ఇక జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను విడిచాడు.. అలాగే అత్తాపూర్లోని ఓ అపార్ట్మెంట్ భవనం టెర్రస్పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు.. విద్యుత్ వైర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.. అలాగే నాగోల్ లో ఓ చిన్నారి గాలి పటాలు ఎగురవేస్తూ చనిపోయాడు..
లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుత్ ప్రసరించే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు తెలాపారు. విద్యుత్ స్తంభాల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచించారు.. చైనా మాంజా హైదరాబాద్లో ఓ సైనికుడి ప్రాణాలను బలిగొంది.. అతని గొంతుకు వైర్ తగిలి కోసుకుపోయింది.. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చనిపోయాడు..
తాజావార్తలు
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా రాజీనామా.. బీజేపీలో చేరిక..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
-
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!