Telangana Teachers: టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.. మరి పదోన్నతులు లేనట్లేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Teachers: రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లలో పదోన్నతులు కాకుండా బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంగళవారం బదిలీల షెడ్యూల్ విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించి టెట్ అర్హత కేసులు ఉండడం, పదోన్నతులపై స్టే ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), మల్టీజోన్ 2 పరిధిలోని జిల్లా పరిషత్ బాదుల్లోని స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) ఉపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. మంగళ, బుధవారాల్లో అప్పీళ్లు, ర్యాంకుల సవరణ, ఖాళీల అప్డేట్కు అవకాశం కల్పించారు. తుది సీనియారిటీ జాబితాలను ఈ నెల 5న ప్రకటిస్తారు. 6, 7 తేదీలలో బదిలీల కోసం వెబ్ ఎంపికలు అందించబడ్డాయి. 8. వెబ్ ఎంపికలను సవరించవచ్చు. వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకున్న తర్వాత ఖాళీ పాయింట్లు, స్పౌజ్ పాయింట్లలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు ప్రకటించారు.
మల్టీజోన్-1లోని 19 జిల్లాల్లో GHM బదిలీలు మరియు పదోన్నతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా టెట్ అర్హత వివాదం నేపథ్యంలో పదోన్నతులను పక్కన పెట్టి బదిలీలు చేపట్టనున్నారు. ఇక మల్టీజోన్-2 పరిధిలోని 14 జిల్లాల్లో జిల్లా పరిషత్లో ఇప్పటి వరకు గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలు మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో హెచ్ఎంల బదిలీలు, పదోన్నతులు రెండూ పూర్తయ్యాయి. వీరితో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు కూడా ముగిశాయి. తాజాగా ఈ మల్టీజోన్ పరిధిలో జిల్లా పరిషత్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు.
Also Read
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
మల్టీజోన్-1లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల కోసం 16,498 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 15,879 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. వీరిలో 5,216 మంది అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరిని మినహాయిస్తే 10,684 మందిని బదిలీ చేయాల్సి ఉండగా, సోమవారం 9,270 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. 1,414 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిలిచిపోయాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఫిజికల్ డైరెక్టర్ల బదిలీలకు బ్రేక్ పడడంతో 1,414 మంది బదిలీలు నిలిచిపోయాయి. పలు సాంకేతిక కారణాలతో అధికారులు వీరి బదిలీలను నిలిపివేశారు.
Central Election Team: ఊపందుకున్న ఎన్నికల హడావుడి.. నేడు తుది ఓటర్ల జాబితా విడుదల
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..