Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Stood No 1 In Organ Donation Says Swarnalatha: అవయవదానంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ‘జీవన్దాన్’ ఇంఛార్జ్ స్వర్ణలత స్పష్టం చేశారు. జీవన్దాన్ పదేళ్లు పూర్తి చేసుకుందని, ఈ దశాబ్ది కాలంలో దాదాపుగా 5 వేల అవయవాలు దానం చేశామని తెలిపారు. లైవ్, కెడవర్ డొనేషన్లో మనమే టాప్లో ఉన్నామని చెప్పారు. జీవన్దాన్ అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2013 నుంచి ఇప్పటివరకు కేడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్లు 4721 నిర్వహించగా.. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ 4938 మందికి నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.
Mallu Ravi: ధరణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మల్లురవి సవాల్
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
అవయవదానం సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో నిర్వహించడం జరుగుతోందని స్వర్ణలత పేర్కొన్నారు. 33 ప్రైవేట్ ఆసుపత్రల్లో సర్జరీలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతున్న వారి నుంచి 7 అవయవ భాగాలను దానం చేయవచ్చని తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్, లంగ్స్, పాంక్రియాస్ వంటి భాగాల్ని దానం చేయవచ్చాన్నారు. వీటిలో అత్యధికంగా 1877 కిడ్నీలు జీవన్దాన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వేచి ఉన్న వారి సంఖ్య 3 వేలకు పైగా ఉందని.. ఇందులో కిడ్నీ కోసం 2 వేలకు పైగా వేచి ఉన్నారని స్వర్ణలత వివరించారు.
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ఇదిలావుండగా.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు, అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్తో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు.. అవయవదానంపై జీవన్దాన్, సన్రైజర్స్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. అపోలో దవాఖానలో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని 1990లో ప్రారంభించి, ఇప్పటివరకు 4872 అవయవ మార్పిడిలు విజయవంతంగా చేశామని స్వర్ణలత తెలిపారు.
తాజావార్తలు
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!