Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Stood No 1 In Organ Donation Says Swarnalatha: అవయవదానంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ‘జీవన్దాన్’ ఇంఛార్జ్ స్వర్ణలత స్పష్టం చేశారు. జీవన్దాన్ పదేళ్లు పూర్తి చేసుకుందని, ఈ దశాబ్ది కాలంలో దాదాపుగా 5 వేల అవయవాలు దానం చేశామని తెలిపారు. లైవ్, కెడవర్ డొనేషన్లో మనమే టాప్లో ఉన్నామని చెప్పారు. జీవన్దాన్ అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2013 నుంచి ఇప్పటివరకు కేడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్లు 4721 నిర్వహించగా.. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ 4938 మందికి నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.
Mallu Ravi: ధరణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మల్లురవి సవాల్
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
అవయవదానం సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో నిర్వహించడం జరుగుతోందని స్వర్ణలత పేర్కొన్నారు. 33 ప్రైవేట్ ఆసుపత్రల్లో సర్జరీలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతున్న వారి నుంచి 7 అవయవ భాగాలను దానం చేయవచ్చని తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్, లంగ్స్, పాంక్రియాస్ వంటి భాగాల్ని దానం చేయవచ్చాన్నారు. వీటిలో అత్యధికంగా 1877 కిడ్నీలు జీవన్దాన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వేచి ఉన్న వారి సంఖ్య 3 వేలకు పైగా ఉందని.. ఇందులో కిడ్నీ కోసం 2 వేలకు పైగా వేచి ఉన్నారని స్వర్ణలత వివరించారు.
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ఇదిలావుండగా.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు, అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్తో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు.. అవయవదానంపై జీవన్దాన్, సన్రైజర్స్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. అపోలో దవాఖానలో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని 1990లో ప్రారంభించి, ఇప్పటివరకు 4872 అవయవ మార్పిడిలు విజయవంతంగా చేశామని స్వర్ణలత తెలిపారు.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!