Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Stood No 1 In Organ Donation Says Swarnalatha: అవయవదానంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ‘జీవన్దాన్’ ఇంఛార్జ్ స్వర్ణలత స్పష్టం చేశారు. జీవన్దాన్ పదేళ్లు పూర్తి చేసుకుందని, ఈ దశాబ్ది కాలంలో దాదాపుగా 5 వేల అవయవాలు దానం చేశామని తెలిపారు. లైవ్, కెడవర్ డొనేషన్లో మనమే టాప్లో ఉన్నామని చెప్పారు. జీవన్దాన్ అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2013 నుంచి ఇప్పటివరకు కేడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్లు 4721 నిర్వహించగా.. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ 4938 మందికి నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.
Mallu Ravi: ధరణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మల్లురవి సవాల్
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
అవయవదానం సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో నిర్వహించడం జరుగుతోందని స్వర్ణలత పేర్కొన్నారు. 33 ప్రైవేట్ ఆసుపత్రల్లో సర్జరీలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతున్న వారి నుంచి 7 అవయవ భాగాలను దానం చేయవచ్చని తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్, లంగ్స్, పాంక్రియాస్ వంటి భాగాల్ని దానం చేయవచ్చాన్నారు. వీటిలో అత్యధికంగా 1877 కిడ్నీలు జీవన్దాన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వేచి ఉన్న వారి సంఖ్య 3 వేలకు పైగా ఉందని.. ఇందులో కిడ్నీ కోసం 2 వేలకు పైగా వేచి ఉన్నారని స్వర్ణలత వివరించారు.
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ఇదిలావుండగా.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు, అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్తో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు.. అవయవదానంపై జీవన్దాన్, సన్రైజర్స్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. అపోలో దవాఖానలో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని 1990లో ప్రారంభించి, ఇప్పటివరకు 4872 అవయవ మార్పిడిలు విజయవంతంగా చేశామని స్వర్ణలత తెలిపారు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!