TG SSC : మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం..?
- మార్చి 18 నుంచి పదో పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం
- ప్రతి సబ్జెక్టుకు ఒకటి రెండు రోజుల విరామంపై ప్రభుత్వం ఆలోచన
- సీబీఎస్ఈ మాదిరి గ్యాప్ ఇవ్వాలని విద్యాశాఖ వ్యూహం
- విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు కొత్త షెడ్యూల్ కసరత్తు
TG SSC : తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. పరీక్షల తేదీల ఖరారుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈసారి పరీక్షల షెడ్యూల్లో ప్రతి సబ్జెక్టుకు మధ్య ఒకటి లేదా రెండు రోజుల విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అధికారులు రెండు నుంచి మూడు ప్రత్యామ్నాయ షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నందున అధికారిక ప్రకటన కొద్దిగా ఆలస్యమవుతోంది.
Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందా?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో కూడా ఒక్కో పరీక్షకు ఎక్కువ విరామం ఇచ్చే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్ కూడా వస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా, ఇలాంటి నమూనాను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో కొన్ని పేపర్ల మధ్య ఒక్కరోజు కూడా విరామం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్య విరామం ఇవ్వాలని నిపుణులు సైతం సిఫార్సు చేస్తున్నారు.
అయితే పరీక్షల వ్యవధిని పెంచితే విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువవుతుందని కొందరు భావిస్తుండగా, మరోవైపు ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం వల్ల పునర్విమర్శకు సమయం దొరకడంతో ఒత్తిడి తగ్గుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో కాకపోయినా, కనీసం ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం సరైనదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమంటే, సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తోంది. ఆప్షనల్ సబ్జెక్టుల కారణంగా పేపర్ల మధ్య సహజంగానే ఎక్కువ వ్యవధి వస్తోంది. ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ సెప్టెంబర్ 24న విడుదలైన విషయం తెలిసిందే.
TV Offer: వర్త్ వర్మ వర్త్.. TCL 55 అంగుళాల టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్..!
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!