TG SSC : మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం..?
- మార్చి 18 నుంచి పదో పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం
- ప్రతి సబ్జెక్టుకు ఒకటి రెండు రోజుల విరామంపై ప్రభుత్వం ఆలోచన
- సీబీఎస్ఈ మాదిరి గ్యాప్ ఇవ్వాలని విద్యాశాఖ వ్యూహం
- విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు కొత్త షెడ్యూల్ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SSC : తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. పరీక్షల తేదీల ఖరారుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈసారి పరీక్షల షెడ్యూల్లో ప్రతి సబ్జెక్టుకు మధ్య ఒకటి లేదా రెండు రోజుల విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అధికారులు రెండు నుంచి మూడు ప్రత్యామ్నాయ షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నందున అధికారిక ప్రకటన కొద్దిగా ఆలస్యమవుతోంది.
Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందా?
Also Read
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో కూడా ఒక్కో పరీక్షకు ఎక్కువ విరామం ఇచ్చే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్ కూడా వస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా, ఇలాంటి నమూనాను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో కొన్ని పేపర్ల మధ్య ఒక్కరోజు కూడా విరామం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్య విరామం ఇవ్వాలని నిపుణులు సైతం సిఫార్సు చేస్తున్నారు.
అయితే పరీక్షల వ్యవధిని పెంచితే విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువవుతుందని కొందరు భావిస్తుండగా, మరోవైపు ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం వల్ల పునర్విమర్శకు సమయం దొరకడంతో ఒత్తిడి తగ్గుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో కాకపోయినా, కనీసం ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం సరైనదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమంటే, సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తోంది. ఆప్షనల్ సబ్జెక్టుల కారణంగా పేపర్ల మధ్య సహజంగానే ఎక్కువ వ్యవధి వస్తోంది. ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ సెప్టెంబర్ 24న విడుదలైన విషయం తెలిసిందే.
TV Offer: వర్త్ వర్మ వర్త్.. TCL 55 అంగుళాల టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్..!
తాజావార్తలు
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!