SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
- కార్మిక శాఖకు కొత్త పేరు ‘SHAKTI’
- స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్స్
- యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ కీలక నిర్ణయం
- అడ్మిషన్లపై ప్రభావం లేదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SHAKTI : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని “కార్మిక, ఉపాధి, శిక్షణ , కర్మాగారాల శాఖ” (Labour, Employment, Training and Factories Department) పేరును మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ విభాగాన్ని “నైపుణ్య మానవ మూలధనం , జ్ఞాన శిక్షణ కార్యక్రమాల శాఖ” (Department of Skill Human Capital and Knowledge Training Initiatives – SHAKTI) గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నంబర్ 97 (G.O.Ms.No:97) ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు.
ఒకే గొడుగు కిందికి విద్యా, సాంకేతిక సంస్థలు
నూతనంగా రూపాంతరం చెందిన ఈ ‘శక్తి’ (SHAKTI) శాఖ పరిధిలోకి యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కీలక విద్యా సంస్థలను ప్రభుత్వం బదలాయించింది. ఇందులో భాగంగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు.. ఇంతవరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో ఉన్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) సబ్జెక్టును ఇకపై నూతనంగా ఏర్పాటైన ‘శక్తి’ శాఖకు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు (ITIs) , అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఇకపై నేరుగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ సంస్థాగత పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎకోసిస్టమ్ , ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు
పరిపాలనా సౌలభ్యం, విద్యా విధానంలో నాణ్యత , యువతకు ఉపాధి నైపుణ్యాలను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ భారీ మార్పులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ అడ్మిషన్ల ప్రక్రియపై కొత్త నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీల్లో కొనసాగుతున్న ప్రవేశాల ప్రక్రియ యథావిధిగా సాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నూతన సంస్కరణలకు అనుగుణంగా ‘తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్-1982’, ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్-2024’ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని సంబంధిత శాఖలను సీఎస్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!