Telangana: తాగుబోతుల్లో మనమే తోపు.. తగ్గేదె లే అంటున్న పోరగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: మద్యం సేవించటమంటే యువతకు ఓ ఫ్యాషన్లా మారిపోయింది. మందంటే చాటు ముందుంటున్నారు. ఇంతకుముందు ఏదైనా కారణముంటేనే దావత్లు ఓరేంజ్లో ఉంటుంది. అందంతా గప్పుడు కానీ.. ఇప్పుడు దావత్ అవసరంలే.. మందు తాగేందుకు కారణాలు వెతుక్కుంటూ అంతలా తాగుడుకు అలవాటుపడుతున్నారు. అందులోనూ మన తెలంగాణ పోరగాళ్లు మాత్రం మరీనూ.. బాద, సంతోషం ఏదైనా సరే, మందు గ్లాసులు గలగలలాడాల్సిందే.. కారణం ఏదైనా సరే పార్టీల పేరుతో మోతాదుకు మించి మద్యం సేవించాల్సిందే.. దీంతో యువత మందుకు బాగా అవాటు పడుతున్న వారి సంఖ్య తెలంగాణలోనే అధికంగా ఉంటోందని ఓసర్వేలో వెల్లడించడం దీనికి నిదర్శనం. తెలంగాణలో ప్రతి ఇద్దరు పురుషుల్లో మద్యం తాగే వారి సంఖ్య దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందంటా మరి. తెలంగాణ మజాకా మనతోటి మామూలుగా ఉందడు మరి సందర్భమేదైనా బాటిళ్లు పొర్లేయాల్సిందే గట్లుంటది మనతోటి అంటున్నారు తెలంగాన యువత.
Read also: Earthquake: వణికిస్తోన్న వరుస భూకంపాలు.. తెల్లవారుజామున అండమాన్లో భూప్రకంపనలు
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
జాతీయ కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 27,351 ఇళ్లలోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిటీల్లో కంటే పల్లెటూళ్లోనే 49శాతం మంది మగవాళ్లు చుక్కవేయడంలో ముందున్నారని తేలింది. కాగా, ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం మత్తులో తేలిపోతున్నారన్నమాట. ఇక సీటీల్లో అయితే.. ప్రతి ముగ్గరిలోనూ ఒకరు తాగుబోతులే.. ఈవిషయం తెలంగాణతో పోలిస్తే ఏపీ కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. అక్కడ ప్రతినలుగురిలో ఒకరు మాత్రమే మద్యం తాగుతున్నట్లు వెల్లడించి సర్వే సంస్థం. రాష్ట్రంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మద్యానికి బానిసలైన వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పార్టీలు, ఫంక్షన్లలో యువకులు నిర్ణీత మోతాదుకు మించి మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువగా మద్యానికి బానిసలు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఏటా పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖ రూ. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల ద్వారా 2700 కోట్లు. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు రూ. 3037 కోట్లు. ఇందులో అంతకుముందు మాత్రమే రూ. 300 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మంచినీళ్లలా మందు తాగుతున్నారు. ఈ విషయంలో మనకన్న తోపులు లేరంటూ సవాల్ విసురుతున్నారు మన తెలంగాణ పోరగాళ్లు. తెలంగాణ మొనగాళ్లా.. మాజాకా అంటూ తొడకొడుతూ మందులో ముందుకు సాగుతులన్నార మరి.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!