వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య మైన ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేశారు వైఎస్ షర్మిల. అయితే… ఇవాళ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు వైఎస్ షర్మిల. అయితే.. నేడు షర్మిల చేపట్టబోయే నిరుద్యోగ దీక్ష కు ఆటంకం కలిగింది. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. సభ ఏర్పాట్లు చేయడానికి వీలు లేదంటూ… అడ్డుకున్నారు పోలీసులు. రాత్రికి రాత్రి సభకు అనుమతి లేదు అనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు. సభను అడ్డుకుంటే రోడ్డుపైనే దీక్షకు కూర్చుంటామని తేల్చి చెబుతున్నారు కార్యకర్తలు. అయితే.. ఈ సంఘటన పై వైఎస్ షర్మిల ఇంకా స్పందించలేదు.