Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాలు కాగా, మరికొన్ని నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువగా జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తం ప్రమాదాల్లో 53 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురానుంది. కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో వాహనదారులు రెండు హెల్మెట్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో బైక్ ప్రమాదాల మృతుల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్న పోలీసు అధికారులు.
Read also: Fevikwik Treatment: ఇదొక కొత్త ట్రీట్ మెంట్.. కుట్లకు బదులు చిన్నారికి ఫెవిక్విక్తో వైద్యం
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
వాహన నడిపేవారే కాదు.. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉండగా.. ప్రతి వాహనదారుడు బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రతి గంటకు ఒక రోడ్డు ప్రమాదంలో మరణాలు సంభవిస్తుండగా, బైక్లు ఎక్కి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ. గతేడాది 21,619 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 7,559 మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో 10,653 బైక్ ప్రమాదాలు జరగగా, 3,977 మంది మరణించారు. వీరిలో మూడొంతుల మంది తలకు గాయాలై మరణించారని వాహనదారులు, వెనుక కూర్చున్న వారు తెలిపారు.
హెల్మెట్ ధరించడం వల్ల మరణాల రేటు తగ్గుతుందని, స్వల్ప గాయాలతో బతికే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే రైడర్లు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఇది పాక్షికంగా మాత్రమే అమలవుతోంది. ప్రతి ద్విచక్ర వాహనదారుడు రెండు హెల్మెట్లు కలిగి ఉంటే.. ఏదో ఒకవిధంగా వెనుక కూర్చున్న వారు కూడా వాటిని ధరిస్తారని అధికారులు భావించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్లు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, అవసరమైతే రోడ్డు రవాణా నిబంధనలలో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి పంపాలని పోలీసు శాఖ యోచిస్తోంది.
Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!