Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్లోని వాసవి వెంచర్లోని మ్యాన్హోల్లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు.
మూడు రోజుల క్రితం వర్షం కురుస్తున్న సమయంలో సంతోష్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే సమీపంలోని కొండాపూర్ చెరువులో జారిపడి ఉండవచ్చన్న అనుమానంతో రెస్క్యూ టీంలు రెండు రోజులుగా చెరువులో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చెరువులోకి గజ ఈతగాళ్లను ప్రయోగించి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నిన్న వాసవీ వెంచర్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే బాలుడి మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంతోష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
అయితే బాలుడు ఎలా మృతి చెందాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా హత్య చేసి మ్యాన్హోల్లో పడవేశారా? లేక ఆ బాలుడు వర్షంలో జారి మ్యాన్హోల్లో పడ్డాడా? పోలీసులు విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం కుండపోత వర్షం కురుస్తుండడంతో బాలుడు బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటికి రాలేదని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బాలుడు మ్యాన్హోల్లో జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంటికి దూరంగా ఉన్న మ్యాన్ హోల్ వద్దకు బాలుడు ఎలా వెళ్లాడు అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!