Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్లోని వాసవి వెంచర్లోని మ్యాన్హోల్లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు.
మూడు రోజుల క్రితం వర్షం కురుస్తున్న సమయంలో సంతోష్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే సమీపంలోని కొండాపూర్ చెరువులో జారిపడి ఉండవచ్చన్న అనుమానంతో రెస్క్యూ టీంలు రెండు రోజులుగా చెరువులో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చెరువులోకి గజ ఈతగాళ్లను ప్రయోగించి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నిన్న వాసవీ వెంచర్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే బాలుడి మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంతోష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
అయితే బాలుడు ఎలా మృతి చెందాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా హత్య చేసి మ్యాన్హోల్లో పడవేశారా? లేక ఆ బాలుడు వర్షంలో జారి మ్యాన్హోల్లో పడ్డాడా? పోలీసులు విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం కుండపోత వర్షం కురుస్తుండడంతో బాలుడు బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటికి రాలేదని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బాలుడు మ్యాన్హోల్లో జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంటికి దూరంగా ఉన్న మ్యాన్ హోల్ వద్దకు బాలుడు ఎలా వెళ్లాడు అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!