Telangana: సాయుధ పోరాటం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే… మిగతావాళ్లు పుట్టనే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇప్పుడు ప్రధానంగా సెప్టెంబర్ 17వ తేదీపై చర్చ సాగుతోంది.. విమోచనం అని ఒకరంటే.. విలీనమని మరొకరు.. ఇలా సెప్టెంబర్ 17పై రచ్చ సాగుతోంది.. అయితే.. . సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్.. కమ్యూనిస్టులే… మిగతా వాళ్లు అప్పటికీ పుట్టనేలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… బీజేపీ, టీఆర్ఎస్ పుట్టకముందే పోరాటం చేసింది కాంగ్రెస్ అన్న ఆయన.. నిజాం రాజ్యం ఏలుతుంటే.. సైనిక చర్యతో స్వాతంత్య్రం ఇప్పించింది కాంగ్రెస్ అని.. ఇవి స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నారు రేవంత్.. ఇక, బీజేపీ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తుందని మండిపడ్డ ఆయన.. టీఆర్ఎస్, ముస్లిం మైనార్టీలను కాపాడుతున్నట్టు కేసీఆర్ షో చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: New Smartphones: భారత్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్లు..
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
మరోవైపు.. కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై స్పందించిన రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఆయనను అయన సంతోష పెట్టుకోడానికి చెప్పుకునే మాటలు అవి.. బీఆర్ఎస్ అని ఒకసారీ.. ఇంకోసారి ఫ్రంట్ అంటారు.. మీకు కేసీఆర్ ఫ్రంట్లు ప్రాధాన్యత ఉన్నట్టుండి.. కానీ, మాకు ఏం ప్రాధాన్యత అంశం కాదు.. అంత సీరియస్ విషయం కూడా కాదు అంటూ లైట్ తీసుకున్నారు రేవంత్.. ఇక, మేం అధికారంలోకి వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని ప్రకటించారు. నేరాల పుట్ట ప్రగతి భవన్ అని ఆరోపించిన ఆయన.. అందుకే ప్రగతి భవన్ లో విచారణ చేయాలి.. లారీల కొద్దీ నోట్లు.. ఒప్పందాల కాగితాలు దొరుకుతాయని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంలో కవిత ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.. బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటి మీద దాడి చేశారు.. కానీ, సీబీఐ, ఈడీ.. కవితకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదన్నారు.. మూలం ప్రగతి భవన్ లో ఉంది. భూమి, ఇసుక, లిక్కర్ స్కామ్లకు కేరాఫ్ ప్రగతి భవన్ అని ఆరోపించిన ఆయన.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. 2014 నుండి 2022 వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆర్ధిక స్థితిగతులపై సీబీఐ విచారణ చేయించాలి.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఫిరాయింపుదారుల వ్యాపారాలు.. కాంట్రాక్టులు.. భూముల రెగ్యులరైజేషన్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!