Telangana: సాయుధ పోరాటం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే… మిగతావాళ్లు పుట్టనే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇప్పుడు ప్రధానంగా సెప్టెంబర్ 17వ తేదీపై చర్చ సాగుతోంది.. విమోచనం అని ఒకరంటే.. విలీనమని మరొకరు.. ఇలా సెప్టెంబర్ 17పై రచ్చ సాగుతోంది.. అయితే.. . సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్.. కమ్యూనిస్టులే… మిగతా వాళ్లు అప్పటికీ పుట్టనేలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… బీజేపీ, టీఆర్ఎస్ పుట్టకముందే పోరాటం చేసింది కాంగ్రెస్ అన్న ఆయన.. నిజాం రాజ్యం ఏలుతుంటే.. సైనిక చర్యతో స్వాతంత్య్రం ఇప్పించింది కాంగ్రెస్ అని.. ఇవి స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నారు రేవంత్.. ఇక, బీజేపీ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తుందని మండిపడ్డ ఆయన.. టీఆర్ఎస్, ముస్లిం మైనార్టీలను కాపాడుతున్నట్టు కేసీఆర్ షో చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: New Smartphones: భారత్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్లు..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మరోవైపు.. కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై స్పందించిన రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఆయనను అయన సంతోష పెట్టుకోడానికి చెప్పుకునే మాటలు అవి.. బీఆర్ఎస్ అని ఒకసారీ.. ఇంకోసారి ఫ్రంట్ అంటారు.. మీకు కేసీఆర్ ఫ్రంట్లు ప్రాధాన్యత ఉన్నట్టుండి.. కానీ, మాకు ఏం ప్రాధాన్యత అంశం కాదు.. అంత సీరియస్ విషయం కూడా కాదు అంటూ లైట్ తీసుకున్నారు రేవంత్.. ఇక, మేం అధికారంలోకి వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని ప్రకటించారు. నేరాల పుట్ట ప్రగతి భవన్ అని ఆరోపించిన ఆయన.. అందుకే ప్రగతి భవన్ లో విచారణ చేయాలి.. లారీల కొద్దీ నోట్లు.. ఒప్పందాల కాగితాలు దొరుకుతాయని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంలో కవిత ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.. బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటి మీద దాడి చేశారు.. కానీ, సీబీఐ, ఈడీ.. కవితకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదన్నారు.. మూలం ప్రగతి భవన్ లో ఉంది. భూమి, ఇసుక, లిక్కర్ స్కామ్లకు కేరాఫ్ ప్రగతి భవన్ అని ఆరోపించిన ఆయన.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. 2014 నుండి 2022 వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆర్ధిక స్థితిగతులపై సీబీఐ విచారణ చేయించాలి.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఫిరాయింపుదారుల వ్యాపారాలు.. కాంట్రాక్టులు.. భూముల రెగ్యులరైజేషన్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!