Telangana new secretariat: సచివాలయం నలుదిక్కులా ద్వారాలు.. దేనిలోనుంచి ఎవరు వస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana new secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డా. బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్’ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఇవాల మధ్యాహ్నం 1:20 గంటలకు ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు.
సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిలో వాయువ్య ద్వారం అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల కదలికలు ఈశాన్య ద్వారం గుండా కొనసాగుతాయి. ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) ద్వారం సందర్శకుల కోసం ఉపయోగించబడుతుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు మరియు ముఖ్యమైన ఆహ్వానితులకు, దేశ, విదేశీ అతిథులకు మాత్రమే వినియోగిస్తారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
Read also: Warangal Crime: ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లింది.. లైంగిక దాడికి గురైంది
బాహుబలి మహాద్వారాన్ని 29 అడుగుల వెడల్పు మరియు 24 అడుగుల ఎత్తుతో నాలుగు తలుపులతో నిర్మించారు. నాగ్పూర్లోని ఈ మహాద్వారాన్ని ఆదిలాబాద్ అడవుల్లోని టేకు చెక్కతో తయారు చేశారు. చెక్కపై ఇత్తడితో చెక్కారు. సచివాలయ ప్రాంగణం మొత్తం తలుపులన్నీ టేకుతో చేసినవే. తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్లకు భారీ గోపురాలున్నట్లే రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ గోపురాలు నిర్మించారు. 34 గోపురాలు మరియు సింహాల బొమ్మలు, జాతీయ చిహ్నం, కొత్త సచివాలయానికి కిరీటం. ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.
సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గోపురాలు నిర్మించారు. ప్రభుత్వ భవనాలు సహా ఆధునిక నిర్మాణాల్లో ఇంత భారీ గోపురాలు రూపొందించడం ఇదే తొలిసారి. ప్రతి గోపురం 82 అడుగుల ఎత్తు (సుమారు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇవి సచివాలయ భవన డిజైన్ ప్రకారం భవనానికి తూర్పు, పడమర వైపులా ఉన్నాయి. గోపురాల లోపలి భాగం స్కై లాంజ్ శైలిలో రూపొందించబడింది. ఇది దాని విశాలమైన కిటికీల నుండి చుట్టుపక్కల నగరం యొక్క వీక్షణను అందిస్తుంది.
New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!