Telangana new secretariat: సచివాలయం నలుదిక్కులా ద్వారాలు.. దేనిలోనుంచి ఎవరు వస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana new secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డా. బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్’ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఇవాల మధ్యాహ్నం 1:20 గంటలకు ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు.
సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిలో వాయువ్య ద్వారం అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల కదలికలు ఈశాన్య ద్వారం గుండా కొనసాగుతాయి. ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) ద్వారం సందర్శకుల కోసం ఉపయోగించబడుతుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు మరియు ముఖ్యమైన ఆహ్వానితులకు, దేశ, విదేశీ అతిథులకు మాత్రమే వినియోగిస్తారు.
Also Read
- CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు... మోడీ సర్కార్ ఫెయిల్
- TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
Read also: Warangal Crime: ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లింది.. లైంగిక దాడికి గురైంది
బాహుబలి మహాద్వారాన్ని 29 అడుగుల వెడల్పు మరియు 24 అడుగుల ఎత్తుతో నాలుగు తలుపులతో నిర్మించారు. నాగ్పూర్లోని ఈ మహాద్వారాన్ని ఆదిలాబాద్ అడవుల్లోని టేకు చెక్కతో తయారు చేశారు. చెక్కపై ఇత్తడితో చెక్కారు. సచివాలయ ప్రాంగణం మొత్తం తలుపులన్నీ టేకుతో చేసినవే. తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్లకు భారీ గోపురాలున్నట్లే రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ గోపురాలు నిర్మించారు. 34 గోపురాలు మరియు సింహాల బొమ్మలు, జాతీయ చిహ్నం, కొత్త సచివాలయానికి కిరీటం. ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.
సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గోపురాలు నిర్మించారు. ప్రభుత్వ భవనాలు సహా ఆధునిక నిర్మాణాల్లో ఇంత భారీ గోపురాలు రూపొందించడం ఇదే తొలిసారి. ప్రతి గోపురం 82 అడుగుల ఎత్తు (సుమారు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇవి సచివాలయ భవన డిజైన్ ప్రకారం భవనానికి తూర్పు, పడమర వైపులా ఉన్నాయి. గోపురాల లోపలి భాగం స్కై లాంజ్ శైలిలో రూపొందించబడింది. ఇది దాని విశాలమైన కిటికీల నుండి చుట్టుపక్కల నగరం యొక్క వీక్షణను అందిస్తుంది.
New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!