తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసింది. ఆయా ఎన్నికల్లో పార్టీ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించడంతో, అదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ముగించేయాలని తొలుత భావించింది. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా అభ్యర్థుల ఎంపికను సిద్ధం చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది.
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్త జనాభా లెక్కల షెడ్యూల్ ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత జనాభా లెక్కల ప్రక్రియ జరగనుంది. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన ప్రారంభం కానుంది. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే, జనగణన ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాలి. లేనిపక్షంలో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే, జనగణన ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వ పెద్దల వద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎంపీటీసీ , జెడ్పీటీసీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు.
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
