AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
- 80 వేల మందికి డిజిటల్ సేఫ్టీ, ఏఐ కోర్సులు
- ఆగస్టు 15 నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం
- 205 గురుకులాల్లో అత్యాధునిక శిక్షణ
- ప్రపంచస్థాయి నైపుణ్యాలే ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Training : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును సరికొత్త సాంకేతికత వైపు నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (TMREIS) చదువుతున్న సుమారు 80,000 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , డిజిటల్ సేఫ్టీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, మస్క్ నెక్స్ట్జెన్ (MASK NextGen) , డోక్సా కన్సల్టింగ్ (DCPL) సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన “ఏఐ రీడైనెస్ అండ్ డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్” (AI Readiness and Digital Safety Program) రాబోయే ఆగస్టు 15 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రతి బిడ్డకూ నాణ్యమైన సాంకేతిక విద్యను అందించి, తెలంగాణను అంతర్జాతీయ ఐటీ హబ్గా మార్చాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు అనుగుణంగా ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అంతర్జాతీయ పోటీకి అండగా గ్లోబల్ పార్ట్నర్ ‘డోక్సా’
ఈ నూతన విద్యా విధానం ద్వారా గురుకుల విద్యార్థులకు చిన్నతనం నుంచే కృత్రిమ మేధస్సు (AI) పరిజ్ఞానం, కోడింగ్ ప్రాథమికాంశాలు , సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. తెలంగాణ యువత కేవలం స్థానికంగానే కాకుండా ప్రపంచస్థాయి పోటీని తట్టుకుని నిలబడేలా, వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ డోక్సా కన్సల్టింగ్ గ్లోబల్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఈ అత్యాధునిక శిక్షణ మైనారిటీ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే కాకుండా, రాబోయే రోజుల్లో వారికి ఐటీ రంగంలో అద్భుతమైన ఉపాధి , ఉన్నత విద్యా అవకాశాలను కల్పించడంలో మైలురాయిగా నిలవనుంది.
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
తాజావార్తలు
-
AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
-
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
-
BCCI Trolls: పర్ఫామెన్స్కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!