KTR: ఇలా చేయండి.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఇప్పటికే ఏ జిల్లాలో.. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసేది కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.. ఇక కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభిస్తున్నారు.. ఇవాళ పీర్జాదిగూడ మున్సిపాలిటీలో నిరుద్యోగుల కోసం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. 6 నెలలు సినిమాలకు దూరంగా ఉండండని సూచించిన ఆయన.. క్రికెట్ కూడా తక్కువ చూడండి.. ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలను కూడా బంద్ చేయండి.. చదువుపై దృష్టి పెట్టాలన్నారు.. ఫోన్ తక్కువగా వాడితేనే లాభం ఉంటుందన్న ఆయన.. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా భవిష్యత్కు ప్రణాళికలు వేసుకోవాలంటూ సూచనలు చేశారు మంత్రి కేటీఆర్.
Read Also: Vaccination: గుడ్న్యూస్.. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఎల్లుండి నుంచే..
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ఇక, కేంద్రంలో 15,62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా నింపక తప్పదన్నారు కేటీఆర్.. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదన్న ఆయన.. ప్రభుత్వం ఇవన్నీ మీ కోసమే చేస్తుంది.. పోటీతత్వంతో కష్టపడితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నారు.. రాష్ట్రంలో 19 వేలు పరిశ్రమలు వచ్చాయి.. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే సంస్థలకు రాయితీలు ఇస్తున్నామన్న ఆయన.. 90 వేలు ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.. కోచింగ్ సెంటర్లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్న ఆయన.. 3 నుంచి 4 నెలల పాటు ఈ కోచింగ్ సెంటర్ కొనసాగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు కొనసాగుతాయి. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నారని తెలిపారు.. ఇదే సమయంలో.. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానెల్ను ప్రారంభించామని గుర్తుచేసిన ఆయన.. యూట్యూబ్లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో లభ్యమవుతుందన్నారు. ఈ చానెల్ను వాడుకోవాలని సూచిస్తున్నాను. మీ కోసమే ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
- Tags
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!