తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు సీఎంగా చేస్తూ ఏం సాధించావని ప్రశ్నించిన హరీష్రావు.. తెలంగాణతో మీ రాష్ట్రం దేనికి పోలిక..? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఈ రోజే..
మీరా అవినీతి కోసం మాట్లాడేది అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ను నిలదీశారు హరీష్రావు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. మరి మీ మధ్యప్రదేశ్ లో పెద్ద కుంభకోణం జరిగింది.. వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి…? ఎవరికైనా శిక్ష పడిందా..? మనుషులనే మీరు చంపేసారు.. మీ కుంటుబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.. మరి దాని సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఇక, 317 జీవో రద్దు చేయాలా… అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా…? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు హరీష్రావు.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా..? నిరుద్యోగులకు ఉద్యోగాలురావాలని సీఎం గారు భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దను బీజేపీ కుట్ర చేస్తోందని అని ఆరోపించారు.
