దానిపై ఉత్తర్వులు తీసుకురండి.. బీజేపీకి మంత్రి గంగుల సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రైతులు పండించిన యాసంగి పంటను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. 12న శుక్రవారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని వెల్లడించిన ఆయన.. రాజ్యాంగ బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోవద్దు అని సూచించారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల కరెంటు, రైతుబంధు లాంటి పథకాలతో రైతుల కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తమది అన్నారు మంత్రి గంగుల.. కళ్లమంట, కడుపుమంటతో తెలంగాణ రైతుల్ని కేంద్రం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. యాసంగి ఔటర్న్ ఎఫ్.సి.ఐ కు తెలియదా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రత్యేక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో యాసంగి ధాన్యం విరిగిపోతుందన్నారు.. బాయిల్డ్ గానే ఔటర్న్ సాధ్యపడుతుందని.. లేఖ ద్వారా యాసంగి పారాబాయిల్డ్ తీసుకోమని కేంద్రం చెప్పిందన్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం అదే చెబుతున్నారని.. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగిలో వరి వేయమని ఎందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్.. అప్పటిదాక ఉద్యమిస్తాం.. రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. కోవిడ్ నిబంధనలు, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే ధర్నాలు ఉంటాయని వెల్లడించారు.
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!