దానిపై ఉత్తర్వులు తీసుకురండి.. బీజేపీకి మంత్రి గంగుల సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రైతులు పండించిన యాసంగి పంటను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. 12న శుక్రవారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని వెల్లడించిన ఆయన.. రాజ్యాంగ బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోవద్దు అని సూచించారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల కరెంటు, రైతుబంధు లాంటి పథకాలతో రైతుల కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తమది అన్నారు మంత్రి గంగుల.. కళ్లమంట, కడుపుమంటతో తెలంగాణ రైతుల్ని కేంద్రం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. యాసంగి ఔటర్న్ ఎఫ్.సి.ఐ కు తెలియదా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రత్యేక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో యాసంగి ధాన్యం విరిగిపోతుందన్నారు.. బాయిల్డ్ గానే ఔటర్న్ సాధ్యపడుతుందని.. లేఖ ద్వారా యాసంగి పారాబాయిల్డ్ తీసుకోమని కేంద్రం చెప్పిందన్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం అదే చెబుతున్నారని.. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగిలో వరి వేయమని ఎందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్.. అప్పటిదాక ఉద్యమిస్తాం.. రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. కోవిడ్ నిబంధనలు, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే ధర్నాలు ఉంటాయని వెల్లడించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!