Telangana : జూనియర్ కళాశాలల్లో హాజరు కోసం ఇక ఫోటో చాలు.. ఎలా అంటే?
- జూనియర్ కళాశాలల్లో కొత్త హాజరు పద్ధతి
- 10 సెకన్లలో రిజిస్ట్రేషన్.. WhatsAppలో తల్లిదండ్రులకు సమాచారం
- ప్రాక్సీ హాజరుకి చెక్.. పారదర్శకత పెంపు
- విద్యా రంగంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ దిశగా తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు చేసే అవకాశం లేకుండా ఖచ్చితమైన హాజరు నమోదు జరుగుతుందని అధికారులు తెలిపారు. హాజరు వివరాలు వెంటనే కేంద్ర డేటాబేస్లో అప్డేట్ అవుతాయి. దీంతో విద్యాశాఖకు రియల్-టైమ్లో పర్యవేక్షణ సులభమవుతుందని, ప్రిన్సిపాళ్లకు మానవీయ పనిలో తగ్గింపుతో పాలనా సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను విశ్లేషించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని అన్నారు.
SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా, IAS మాట్లాడుతూ, “430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం ఒక విప్లవాత్మక అడుగు. ఇది పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకువస్తుంది. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఉపకరిస్తుంది. విద్యను మరింత సమర్థవంతం చేయడం, డిజిటల్ చేయడం, విద్యార్థులకు స్నేహపూర్వకంగా మార్చడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు. అదే విధంగా టీజీబీఐఈ కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, “ఈ సిస్టమ్ను విజయవంతం చేయడానికి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సహకరించాలి.
ప్రస్తుతం మొత్తం 1,64,621 విద్యార్థుల్లో 63,587 మంది రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. మిగతా రిజిస్ట్రేషన్లు సోమవారానికల్లా పూర్తవుతాయి” అని తెలిపారు. ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్కు కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని, WhatsApp ఇంటిగ్రేషన్ ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు, రిపోర్టులపై రియల్-టైమ్ సమాచారం చేరుతుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఆధునిక డిజిటల్ వ్యవస్థ ప్రారంభం కావడం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో, విద్యార్థుల అకడమిక్ ట్రాకింగ్లో, పారదర్శకత సాధించడంలో మైలురాయిగా భావిస్తున్నారు.
SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా
తాజావార్తలు
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!