Earthquake: 55 ఏళ్లలో తెలంగాణలో రెండో అతిపెద్ద భూకంపం.. కారణాలేంటి..?
- ములుగు భూకంపంతో వణికిన తెలంగాణ..
- ములుగు సమీప జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ప్రకంపనలు..
- గోదావరి ఫాల్ట్ జోన్ కారణంగానే భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
55 ఏళ్లలో తెలంగాణలో సంభవించిన రెండో అతిపెద్ద భూకంపం ఇదే. ములుగు సమీపంలోని గోదావరి నదిలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందు 1967లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, అప్పటి నుంచి చిన్నపాటి భూకంపాలు నమోదయ్యాయి. 5 తీవ్రతతో రావడం చాలా అరుదు. కానీ ఈ రోజు మాత్రం ములుగు దాని చుట్టుపక్కల ప్రాంతాలు బలమైన భూకంపాన్ని ఎదుర్కొన్నాయి.
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
Read Also: TG Police Dept: తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం.. ట్రాఫిక్ విధుల్లో 44 మంది ట్రాన్స్ జెండర్లు
నిజానికి ఈ ప్రాంతం తరుచుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కాదని, తీవ్రస్థాయిలో భూకంపాలు రావని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని 59 శాతం వివిధ తీవ్రతలతో భూకంపాలకు గురువుతుంటుంది. భూకంపాలు సంభవించే ప్రాంతాలను, వాటి తీవ్రత దృష్ట్యా జోన్ II, జోన్ III, జోన్ IV , జోన్ Vగా 4 జోన్లుగా విభజించారు. జోన్-5 అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతం. అతితక్కువ తీవ్రత కలిగిన ప్రాంతం జోన్-2. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కువ స్థాయి భూకంపాలు సంభవించే జోన్-2లో ఉంది.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉంది. ఇది భూకంపానికి కారణమవుతుంది. ఫాల్ట్ జోన్ అంటే భూమి అంతర్భాగంలో రెండు బ్లాకులు ఒకదానితో ఒకటి ఆకాస్మాత్తుగా జారిపోయే ప్రదేశం. ఒక్కోసారి అంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే అపారమైన శక్తి భూకంపాలుగా వస్తుంది. గోదావరి బేసిన్లో పలు చోట్ల పగుళ్లు, లోపాలు ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!