Telangana: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. సాయంత్రం రాగి జావ పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాగు జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్పాహార పథకం ప్రారంభించినందున, విద్యార్థులు రోజు పాఠశాల నుండి బయలుదేరే ముందు రాగి జావను అందించాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగి జావను పంపిణీ చేయడం ప్రారంభించింది. అయితే.. బెల్లం పొడి కలిపిన ఈ సప్లిమెంట్ను వారానికి మూడుసార్లు ఉదయాన్నే ఇచ్చేవారు.
అయితే.. ఇటీవల రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం.. అక్టోబరు 26న పునఃప్రారంభమైన తర్వాత అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. రోజువారీ అల్పాహారం మెనులో ఇడ్లీ, ఉప్మా, పూరీ, మిల్లెట్ ఇడ్లీ ఉంటాయి. పోహా, పొంగల్, వెజిటబుల్ పులావ్, కిచడీ అందజేయనున్నారు. ఈ పథకం 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇప్పటికే సన్న బియ్యం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు పప్పు, సాంబార్, వెజిటబుల్ కర్రీ, లెగ్యూమ్ వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, బగరా రైస్, పులిహోర వంటి ప్రత్యేక అన్నం వడ్డిస్తారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్లు కూడా ఇస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోగా, 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడిగుడ్లు, 9, 10వ తరగతి విద్యార్థులకు భోజనం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
Bussiness Idea : ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు.. ఆదాయం మాములుగా ఉండదు..
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
తాజావార్తలు
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!