Rythu Bandhu : గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక, ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గుడ్న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 28వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం.. ప్రతీ పంటకు ఎలాగైతే రైతు బంధు నిధులు విడుదల చేస్తామో.. అదే తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు. దీంతో.. ఈ నెల 28 నుంచి రైతుబంధు పథకం పెట్టుబడి సాయం నిధులు.. రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.. గుంట పొలం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అందిస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం వరుస క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.
Read Also: Maharashtra Political Crisis: మౌనం వీడిన ఉద్దవ్ థాక్రే.. రెండింటికీ రాజీనామాకు రెడీ..!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతీ ఏడాది రెండు సీజన్లకు పంట పెట్టుబడా సాయం అందిస్తుంది.. ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి విదితమే.. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరికొంత మంది రైతులు చేరారు.. ఇక, రైతుబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.. మరోవైపు, రైతు బంధుకు సంబంధించిన సొమ్మును ఎప్పటిలాగే ఈ వానాకాలం సీజన్లోనూ అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజే తెలిపారు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వ్యవసాయ శాఖ కాల్ సెంటర్కు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించడం, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!