Telangana National Integration Day: సెప్టెంబర్ 17న సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Government Declared Holiday On Telangana National Integration Day: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న తరుణంలో.. రేపు సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు రాష్ట్రంలోని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.
ఇదిలావుండగా.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత యూనియన్లో తెలంగాణ విలీనమై 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తొలిరోజులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు పాలుపంచుకోనున్నారని సమాచారం. మహారాష్ట్ర సీఎంతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు సైతం హాజరు కానున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ ధృవీకరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?