Bandi Sanjay: కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Developing With Centre Funds Says Bandi Sanjay: కేంద్రం ఇస్తోన్న నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి, దేశ రాజకీయాలంటూ కేసిఆర్ తిరుగుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ని ఓ మూర్ఖుడు అని, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని ఆరోపణలు చేశారు. మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తూ.. రాజకీయాలు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. ఓట్ల కోసం పొట్టుపొట్టు పైసలు పంచడమే టిఆర్ఎస్ వాళ్ళకి తెలిసిన పని అని ఆరోపించారు. ప్రజలను దోచుకుని, వేల కోట్లు సంపాదించుకొని, ఎన్నికల్లో ఖర్చు పెట్టడమే టీఆర్ఎస్కు తెలిసిన విద్య అని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేందుకు, ఆత్మవిశ్వాసం పెంచేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని తెలిపారు.
ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకుని, ఓటు మాత్రం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్ది, టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలు కొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఓటుకు పదివేలు, హుజూరాబాద్లో ఓటుకు 20 వేలు, ఇప్పుడు మునుగోడులో 30 వేలు పంచుతున్నాడన్నారు. జీహెచ్ఎంసీలో ఒక్కొక్క డివిజన్కు రూ. 10 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు చేసిందని.. అంత డబ్బు వెచ్చించినప్పటికీ జీహెచ్ఎంసీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. అనేక సంక్షేమ పథకాలు, నిధులు వస్తాయని హామీ ఇచ్చారు. అన్ని సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ను డల్లాస్, న్యూయార్క్, సింగపూర్ చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని ఆయన కోరారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేసి, మందు తాగాడని బండి సంజయ్ ఆరోపించారు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కెసిఆర్ గురించి మందు పోసినోడే తనకు చెప్పాడని అన్నారు. కాగా.. రేపు పెద్ద అంబర్పేట్లో జరిగే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు, అందరూ వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!