Telangana Elections 2023: రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. ఈసీ కీలక ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాన్ని ముమ్మరం చేశాయి. ఓటింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీధులు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోరులో మాటల యుద్ధం, సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార సీజన్ లో బహిరంగ సభలు, రోడ్ షోలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో అంతర్గత సమావేశాలు, స్టార్ క్యాంపెయిన్లు చేస్తూ ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు తుది దశకు చేరుకుంది. ఐదో రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నామినేషన్ల సందడి నెలకొంది.
స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు తమ మద్దతుదారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన కొందరు మరో సారి అదనపు సెట్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లో ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:45 గంటలకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేశారు. మరో ప్రముఖ టీఆర్ఎస్ నేత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం సిద్దిపేటలో హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా వైరాలో శబరి నగర్లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మొత్తం ఐదు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనుండగా, అధికారులు గురు, శుక్రవారాల్లో రెండు రోజులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ రెండు రోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇతర ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!