Telangana Elections 2023: రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. ఈసీ కీలక ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాన్ని ముమ్మరం చేశాయి. ఓటింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీధులు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోరులో మాటల యుద్ధం, సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార సీజన్ లో బహిరంగ సభలు, రోడ్ షోలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో అంతర్గత సమావేశాలు, స్టార్ క్యాంపెయిన్లు చేస్తూ ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు తుది దశకు చేరుకుంది. ఐదో రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నామినేషన్ల సందడి నెలకొంది.
స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు తమ మద్దతుదారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన కొందరు మరో సారి అదనపు సెట్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లో ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:45 గంటలకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేశారు. మరో ప్రముఖ టీఆర్ఎస్ నేత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం సిద్దిపేటలో హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Also Read
ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా వైరాలో శబరి నగర్లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మొత్తం ఐదు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనుండగా, అధికారులు గురు, శుక్రవారాల్లో రెండు రోజులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ రెండు రోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇతర ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!