Telangana Elections 2023: రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. ఈసీ కీలక ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాన్ని ముమ్మరం చేశాయి. ఓటింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీధులు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోరులో మాటల యుద్ధం, సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార సీజన్ లో బహిరంగ సభలు, రోడ్ షోలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో అంతర్గత సమావేశాలు, స్టార్ క్యాంపెయిన్లు చేస్తూ ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు తుది దశకు చేరుకుంది. ఐదో రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నామినేషన్ల సందడి నెలకొంది.
స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు తమ మద్దతుదారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన కొందరు మరో సారి అదనపు సెట్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లో ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:45 గంటలకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేశారు. మరో ప్రముఖ టీఆర్ఎస్ నేత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం సిద్దిపేటలో హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా వైరాలో శబరి నగర్లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మొత్తం ఐదు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనుండగా, అధికారులు గురు, శుక్రవారాల్లో రెండు రోజులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ రెండు రోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇతర ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!