Cyber Fraud : సైబర్ నేరాలపై పెద్ద ఎత్తున ఆపరేషన్.. 228 మంది అరెస్ట్
- సైబర్ సెక్యూరిటీ దూకుడు: 228 మంది నిందితులు అదుపులోకి
- ₹92 కోట్ల మోసం బహిర్గతం చేసిన సైబర్ నేర దర్యాప్తు
- ఫేక్ కాల్ సెంటర్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లతో దేశవ్యాప్తంగా ఉచ్చులు
- ప్రజలకు హెచ్చరిక: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాలపై తన దూకుడు కొనసాగిస్తోంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 228 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు దేశవ్యాప్తంగా 1,313 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, వాటిలో 1,089 కేసులు తెలంగాణకే చెందినవని విచారణలో బయటపడింది. ఇప్పటివరకు వీరు కలిపి సుమారు ₹92 కోట్లు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Film Federation : సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?
Also Read
సైబర్ నేరాల్లో పలు రకాల మోసాలకు పాల్పడిన ఈ నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఫేక్ కాల్ సెంటర్ల పేరుతో అమెరికా పౌరులను టార్గెట్ చేస్తూ మోసాలు చేసిన గుజరాత్ ముఠాలో 63 మందిని అరెస్ట్ చేశారు. అదే విధంగా సూరత్ను కేంద్రంగా చేసుకుని పనిచేసిన మరో ముఠాలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇన్వెస్ట్మెంట్ మరియు జాబ్ ఫ్రాడ్ కేసులు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ నేరాలు, ఇతర సైబర్ నేరాల్లో కూడా పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదనంగా, ఈ ఏడాది ఆన్లైన్లో లైంగిక వేధింపుల కేసుల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Green fuel: భూగర్భంలో భారీగా “గ్రీన్ ఇంధన” నిల్వలు.. 1.70 లక్షల ఏళ్లకు సరిపోయే అద్భుత నిధి..
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..