గత బులెటిన్తో పోలిస్తే.. తెలంగాణ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,762 కొత్త కేసులు నమోదు కాగా, మరో 20 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,816 మంది కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,63,903కు చేరుకోగా.. రికవరీ కేసులు 5,22,082కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు 3,189 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 38,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. గత 24 గంటల్లో 91,048 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది…