తెలంగాణ రోజువారి పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 మందికి కరోనా పాజిటివ్గా తేలగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 594 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,229కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 6,34,612కు చేరింది… మరోవైపు.. రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 3,814కు చేరుకుంది.. కరోనా రికవరీ రేటు దేశంలో 97.03 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.05 శాతంగా ఉందని.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8.803గా ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్. గత 24 గంటల్లో 1,12,796 శాంపిల్స్ను పరీక్షించినట్టు వెల్లడించింది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 77, కరీంనగర్లో 65, ఖమ్మంలో 52 వెలుగు చేశాయి.