తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 74,634 శాంపిల్స్ పరీక్షించగా… 354 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 427 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,343కు పెరగా.. 6,45,174 మంది బాధితులు పూర్తిస్థాయిలో రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్తో రాష్ట్రంలో మృతిచెందినవారి సంఖ్య 3,861కు చేరుకుంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,308 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.