Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దేశంలో 40 కోట్లకు పైగా దళితులు, గిరిజనులున్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు ద్రోహం చేసిందన్నారు. దళితులు, గిరిజనులు కాంగ్రెస్ మాటలు నమ్మడం అమాయకులన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణలో కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో హడావుడి చేస్తున్న పార్టీ.. ఇన్నాళ్లూ ఈ పథకాలను అమలు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన విద్యార్థుల కోసం ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం మొత్తం 1006 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
Read also: September 5 Financial Changes: సెప్టెంబర్లో ఆర్థిక రంగంలో 5 మార్పులు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
దళితులు, గిరిజనులు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారంటే రెసిడెన్షియల్ విద్య ఫలితమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితుల బంధు పథకం ఎందుకు లేదని.. దళితుల బందులకు 12 లక్షలు కాదు, కాంగ్రెస్కు దమ్ముంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని సవాల్ విసిరారు. తెలంగాణలో ఎన్నికలు మాత్రమే ఉన్నాయని ప్రకటన పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్కు దళితులపై ప్రేమ లేదని, ఓట్లపైనే ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత, గిరిజనుల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి ఏదో చేస్తామంటూ కాంగ్రెస్ భ్రమలు కల్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎనిమిదేళ్లలో దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటన బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సమాజంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందన్నది కేవలం దుష్ప్రచారం. ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనమని మంత్రి అన్నారు.
Railway Board CEO: 105 ఏళ్ల భారతీయ రైల్వే చరిత్రలో తొలి మహిళా చైర్మన్.. ఎవరీ జయ వర్మ సిన్హా?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!