జల జగడం.. నీటి పారుదలశాఖపై కేసీఆర్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. జల వివాదం నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించనట్టు తెలుస్తోంది.. ఈనెల 9వ తేదీన జరగబోయే కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.. ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదులు అందగా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత