TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్మీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ డీల్కు ప్రయత్నించడం.. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం పెద్ద రచ్చగా మారింది.. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.. డీల్ సమయంలో.. ఢిల్లీలోని పెద్దలతోనూ మాట్లాడించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది.. మొత్తంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి రెడ్హ్యాండెడ్గా గుట్టును రట్టు చేశారు.. ఆడియో, వీడియో రికార్డింగ్లు సహా అన్ని ఆధారాలతో ఈ భారీ డీల్కు యత్నించినవారిని పట్టుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో ఓ ఫామ్హౌస్లో జరిగిన ఈ బాగోతం మొత్తం బయటపడగా.. ఆ తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. నేరుగా ప్రగతి భవన్కు చేరుకున్నారు.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. రాత్రి ప్రగతిభవన్లోనే ఉన్నారు ఎమ్మెల్యేలు.. అయితే, ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది.. పైసలు, పనులు, పదవులు ఆశచూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారంపై బీజేపీని టార్గెట్ చేసి ఆయన నిప్పులు చెరగనున్నారని సమాచారం.
Read Also: Ration Mafia: రూట్ మార్చిన రేషన్ మాఫియా.. రైళ్లలో సరిహద్దులు దాటుతోన్న బియ్యం..!
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
కాగా, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.. అయితే, దీనిపై అప్రమత్తమైన ఎమ్మెల్యేలు తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో.. పక్కా స్కెచ్తో ఈ ఆపరేషన్ నిర్వహించామని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే వెల్లడించారు.. ఆ ముగ్గురిలో ఒకరు ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్కు చెందిన నందకుమార్ గా తెలిపారు.. ఈ డీల్ వ్యవహారంపై సమగ్ర విచారణ సాగుతుందని పేర్కొన్నారు.. అయితే, ఇవాళ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానుండడంతో.. ఈ భారీ స్కెచ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించనున్నారని తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎవరు? ఎలా సంప్రదించారు..? వీరు అక్కడికు ఎలా వెళ్లారు..? తమకు ముందుగానే ఉన్న సమాచారం ఏంటి..? తెలంగాణలో టీఆర్ఎస్ను దెబ్బ కొట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రలు..! ఇలా అనేక విషయాలను కేసీఆర్ ప్రెస్మీట్లో ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.. సాధారణంగా కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టాడంటేనే అనేక విషయాలు చెబుతుంటారు..? ఇప్పుడు భారీ కుట్రే బయటపడిన సందర్భంలో ఆయన మీడియా ముందుకు రానుండడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!