తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో 3 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 731 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్..దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,627 కు చేరగా… రికవరీ కేసులు 6,23,044 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3759 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 90,966 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్లో పేర్కొన్నారు.