Nallu Indrasena Reddy: త్రిపుర గవర్నర్ గా తెలంగాణ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallu Indrasena Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ త్రిపుర రాష్ట్ర గవర్నర్గా బీజేపీ సీనియర్ నేతను నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్లు ఇంద్రసేనారెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఒడిశా గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నల్లు ఇంద్రసేనారెడ్డి టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మద్దతిస్తూ ఎన్నికల ప్రక్రియను పార్టీ వైపు నుంచి పర్యవేక్షిస్తున్నారు.
నల్లు ఇంద్రసేనారెడ్డి నల్గొండ జిల్లా వాసి. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం. మొదటి తరం బీజేపీ నేతల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి అత్యంత ప్రముఖులు. నల్లు ఇంద్రసేనారెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. నల్లు ఇంద్రసేనారెడ్డి ఏబీవీపీలో చేరి ఆ శాఖ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి జైలుకు కూడా వెళ్లారు. 1983లో తొలిసారిగా మలక్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అందుకే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో నల్లు ఇంద్రసేనారెడ్డి హోంమంత్రిగా ఉన్న ప్రభాకర్రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుపై విజయం సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లో నాదెండ్లపై 17,791 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి మూడోసారి గెలిచి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
ఆగష్టు 2003 లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2006 వరకు ఈ స్థానంలో కొనసాగిన నల్లు ఇంద్రసేనారెడ్డి.. ఆ తర్వాత 2007లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులై ఇప్పటి వరకు జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా నల్లు ఇంద్రసేనారెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ పార్టీలో పలు కీలక నిర్ణయాల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి పాత్ర ఉంది. పార్టీ కోసం అంకితభావంతో పని చేసే నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి. గతంలో నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవిని ఆఫర్ చేశారు. అయితే అప్పట్లో అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అత్యంత కీలకమైన తరుణంలో త్రిపుర గవర్నర్గా ఆయన నియామకం, అందుకు అంగీకరించడం బీజేపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు గవర్నర్లుగా నియమితులవడం ఇప్పుడు కొత్త కాదు. బండారు దత్తాత్రేయ ఇప్పటికే హర్యానా గవర్నర్గా ఉన్నారు.
OTT Release Movies: ఈ వారం సినిమాల జాతరే.. ఓటిటిలోకి 29 సినిమాలు..
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?