Harish Rao : సభ 15 రోజులు కావాలి.. కానీ ఎందుకు రెండే రోజులు పెట్టారు.?
- కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని కోరాం
- ఫోర్త్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై సభలో చర్చ చేయాలని కోరాం
- వరద మీద మాట్లాడుదాం అంటే బురద రాజకీయాలపై మాట్లాడుదాం అంటున్నారు
- రెండే రోజులు సభ నిర్వహించాలని BACలో నిర్ణయించారు
- రేపు సభలో ఎజెండా ఏంటి అంటే.. సమాధానం లేదు
- రాత్రికి డిసైడ్ చేసి చెప్తాం అంటున్నారు
- ముందు చెప్పకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరి ఏమీ లేదు. -హరీష్ రావు
Harish Rao : అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్ను పట్టించుకోకుండా కేవలం రెండే రోజులు సభ నడపాలని నిర్ణయించడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “BAC సమావేశంలో వర్షాల వల్ల జరిగిన నష్టాలపై, ఎరువుల సమస్యపై, విషజ్వరాలపై, ఫోర్త్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై, పేదల కష్టాలపై చర్చ జరపాలని కోరాం. కానీ చర్చకు సమయం ఇవ్వకుండా రెండే రోజులు సభ పెట్టాలని నిర్ణయించారు. వరదలపై మాట్లాడుదామని అంటే బురద రాజకీయాలపై మాట్లాడుదామని అంటున్నారు. ఇది ప్రజలకు అన్యాయం” అని అన్నారు.
Telaganan Cabinet : కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్లు
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
అలాగే, రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “రైతుల కష్టం వారికి చీమ కుట్టినట్లు లేదు. ఎరువుల కొరతపై చర్చిద్దామన్నా సిద్ధంగా లేరు. బీజేపీ ఇవ్వడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా అయితే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు. సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ జరగనుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతించాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.
మధ్యలో గణేష్ నిమజ్జనం, వరదల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సభకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అయితే రేపటి అసెంబ్లీ పూర్తి ఎజెండా ఇంకా ఖరారు కాలేదని, రాత్రికి డిసైడ్ చేసి ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పిందని హరీష్ రావు విమర్శించారు. “ముందు చెప్పకపోతే ప్రతిపక్షం ఎలా ప్రిపేర్ అవుతుంది? ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరేమీ కాదు” అని అన్నారు.
PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?