Harish Rao : సభ 15 రోజులు కావాలి.. కానీ ఎందుకు రెండే రోజులు పెట్టారు.?
- కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని కోరాం
- ఫోర్త్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై సభలో చర్చ చేయాలని కోరాం
- వరద మీద మాట్లాడుదాం అంటే బురద రాజకీయాలపై మాట్లాడుదాం అంటున్నారు
- రెండే రోజులు సభ నిర్వహించాలని BACలో నిర్ణయించారు
- రేపు సభలో ఎజెండా ఏంటి అంటే.. సమాధానం లేదు
- రాత్రికి డిసైడ్ చేసి చెప్తాం అంటున్నారు
- ముందు చెప్పకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరి ఏమీ లేదు. -హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్ను పట్టించుకోకుండా కేవలం రెండే రోజులు సభ నడపాలని నిర్ణయించడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “BAC సమావేశంలో వర్షాల వల్ల జరిగిన నష్టాలపై, ఎరువుల సమస్యపై, విషజ్వరాలపై, ఫోర్త్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై, పేదల కష్టాలపై చర్చ జరపాలని కోరాం. కానీ చర్చకు సమయం ఇవ్వకుండా రెండే రోజులు సభ పెట్టాలని నిర్ణయించారు. వరదలపై మాట్లాడుదామని అంటే బురద రాజకీయాలపై మాట్లాడుదామని అంటున్నారు. ఇది ప్రజలకు అన్యాయం” అని అన్నారు.
Telaganan Cabinet : కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్లు
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
అలాగే, రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “రైతుల కష్టం వారికి చీమ కుట్టినట్లు లేదు. ఎరువుల కొరతపై చర్చిద్దామన్నా సిద్ధంగా లేరు. బీజేపీ ఇవ్వడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా అయితే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు. సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ జరగనుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతించాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.
మధ్యలో గణేష్ నిమజ్జనం, వరదల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సభకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అయితే రేపటి అసెంబ్లీ పూర్తి ఎజెండా ఇంకా ఖరారు కాలేదని, రాత్రికి డిసైడ్ చేసి ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పిందని హరీష్ రావు విమర్శించారు. “ముందు చెప్పకపోతే ప్రతిపక్షం ఎలా ప్రిపేర్ అవుతుంది? ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరేమీ కాదు” అని అన్నారు.
PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?