PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Special Gifts: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం – జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం టోక్యో వెళ్లారు. జపాన్లో పర్యటన ముగించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా దంపతులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. జపాన్ ప్రధానికి చాప్ స్టిక్లతో కూడిన రామెన్ గిన్నెను, ఆయన భార్యకు పాష్మినా శాలువాను బహుమతిగా అందజేశారు.
READ ALSO: AP News: కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమక్షంలో 6 ఎంఓయూలు!
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
ఏంటి ఈ బహుమతుల ప్రత్యేకతలు..
షిగేరు ఇషిబాకు అందజేసిన పాతకాలపు గిన్నెసెట్ భారతీయ చేతిపనులు, జపనీస్ సంప్రదాయంతో కూడిన ప్రత్యేకమైన సమ్మేళనంగా తయారు చేయబడింది. ఇది నాలుగు చిన్న గిన్నెలు, వెండి చాప్స్టిక్లతో అలంకరించి ఉంది. ఈ డిజైన్ జపాన్ సాంప్రదాయ డాన్బురి, సోబా ఆచారాల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ బహుమతి రూపకల్పనలో ఉపయోగించిన చంద్రుని రాయి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. గిన్నె బేస్ రాజస్థాన్లోని ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాయితో తయారు చేశారు. సాంప్రదాయ పార్చిన్ కారి శైలిలో సెమీ-విలువైన రాళ్లతో ఈ రామెన్ గిన్నెను అలంకరించారు.
జపాన్ ప్రధాన మంత్రి భార్యకు కూడా భారత ప్రధాన మంత్రి బహుమతి అందజేశారు. ఆమెకు పేపర్ మాచే బాక్స్లో పాష్మినా శాలువాను బహుమతిగా ఇచ్చారు. లడఖ్లోని చాంగ్తంగి మేక ఉన్నితో తయారు చేసిన ఈ పాష్మినా శాలువా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని కాశ్మీరీ కళాకారులు సాంప్రదాయ పద్ధతిలో చేతితో నేస్తారు. ఈ శాలువా ఒకప్పుడు రాజ కుటుంబాలు ధరించిన చరిత్ర కలిగి ఉంది. భారత ప్రధాని జపాన్ పర్యటనలో ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల ప్రధానులు ఇండియా – జపాన్ ఆర్థిక వేదికలో సమావేశమయ్యారు. ముందుగా జపాన్ ప్రధాని ఇషిబా ప్రధాని మోదీని అధికారికంగా స్వాగతించారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం జపాన్లో భారత ప్రధాని తన పర్యటన ముగించుకొని చైనా బయలుదేరి వెళ్లారు.
READ ALSO: Air Turbulence: గాల్లో కలిసిపోగల జాగ్రత్త.. విమానాలపై తాజా నివేదికలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!