Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో 89 స్థానాల్లోనే టీడీపీ పోటీ.. లిస్టు విడుదలపై నేడు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. దాదాపు పూర్తి స్థాయి కవరేజీతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయగా, బీజేపీ 52 స్థానాలు, కాంగ్రెస్ 55 స్థానాల్లో ఉన్నాయి. రెండో జాబితా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్వవైభవం కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణ టీడీపీ అక్కడి నుంచి నియోజకవర్గాలు, టికెట్ ఆశించేవారి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు చంద్రబాబును కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ములాఖత్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర స్థాయి, పార్లమెంటరీ స్థాయి నేతలతో కలిసి కసరత్తు పూర్తి చేశారు. 119 నియోజకవర్గాలకు గాను 89 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తం 189 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ పోటీకి దూరంగా ఉండొచ్చని భావిస్తున్న 30 నియోజకవర్గాల్లో హైదరాబాద్ లోక్ సభ ప్రాంతంతో పాటు ఉమ్మడి వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. కసరత్తు పూర్తయిన 89 నియోజకవర్గాల్లో కొన్నింటికి ఒకరి పేరు, మరికొన్నింటికి రెండు పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, బరిలో ఉన్న సీట్ల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చంద్రబాబు బాబుదే తుది నిర్ణయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జనసేనతో పొత్తు విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని, తెలంగాణలో మాత్రం ఆ అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పటికే అమిత్ షాతో పవన్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Amith Shah: తెలంగాణలో అమిత్ షా టూర్.. షెడ్యూల్ ఇదీ..
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
తాజావార్తలు
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!