Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Sensational Comments On BJP: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఒక సాదాసీదా పార్టీ కాదని.. బీజేపీని ఆర్ఎస్ఎస్ అనే ఓ ప్రమాదకరమైన సంస్థ నడిపిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బిజెపి భావిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ కట్టబెడుతోందని వ్యాఖ్యానించారు. బిజెపి గెలిస్తే.. మోటార్లకు మీటర్లు పెడతారన్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని.. రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.
ఇదే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. బిజెపి కరోనా కంటే ప్రమాదమని.. డాఫర్, 420, డెకైట్ అందరూ కలిసి బీజేపీ రూపంలో మునుగోడుకు వస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణా బిల్లు, విభజన హామీలను గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు కావాలని దేశం కోరుకుంటోందని.. ఈడీలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కేసీఆర్ బక్కప్రాణాన్ని ఏం చేయలేరని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలని.. తెలంగాణ సమాజం కోసం టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడులో గెలిచేది టిఆర్ఎస్ పార్టీనే.. టిఆర్ఎస్ను గెలిపించేందుకే తాము వచ్చామని పేర్కొన్నారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనేసిందని, కాంట్రాక్ట్ డబ్బులతో మునుగోడు ప్రజల్ని అంగడి సరుకులా కొనడానికి వచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లుగా కనిపించలేదన్నారు. ఒక్కో ఓటును తాను డబ్బు పెట్టి కొంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తానే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ మాటిచ్చారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!