Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Krishnaiah: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో పోలీసు దర్యాప్తుపై కుటుంబీకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఎన్టీవీతో తమ్మినేని క్రిష్ణయ్య బార్య మంగ తాయమ్మ కుమారుడు నవీన్, కుమార్తె రజిత మాట్లాడారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుపై క్రిష్ణయ్య , ప్రధాన సూత్రధారి కోటేశ్వరరావు పేరు లేదంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాన్న (తమ్మినేని కృష్ణయ్య హత్య) హత్యకు కోటేశ్వరరావు కుట్ర చేసారని పోలీసులకు ఫిర్యాదు చేశాము. కానీ.. కోటేశ్వరరావు పేరు లేకుండానే రిమాండ్ రిపోర్టు కోర్టులో సమర్పించారని కన్నీరు పెట్టుకున్నారు. ఒత్తిళ్లతోనే కేసులో ప్రధాన సూత్రధారి పేరు లేకుండా చేశారని మండిపడ్డారు. మాకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తమ్మినేని కృష్ణయ్యను ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆగస్టు 15న ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్లో కృష్ణయ్య స్పాట్లోనే మృతి చెందారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఈహత్య జరిగినవిషయం తెలిసిందే.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
అయితే.. ఆగస్టు 18న తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులు అరెస్టు చేసారు. ఖమ్మం జిల్లా తెల్దార పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకే ఏడుగురు వ్యక్తులు కృష్ణయ్య హత్యలో పాల్గొన్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు. నిందితులన పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా A1 గాఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
CJI NV Ramana: సీజేఐ హ్యాపీడేస్.. ఏఎన్యూలో చదివిన రోజులను గుర్తుచేసుకున్న ఎన్వీ రమణ
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!