Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం..!
Tammineni Krishnaiah: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో పోలీసు దర్యాప్తుపై కుటుంబీకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఎన్టీవీతో తమ్మినేని క్రిష్ణయ్య బార్య మంగ తాయమ్మ కుమారుడు నవీన్, కుమార్తె రజిత మాట్లాడారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుపై క్రిష్ణయ్య , ప్రధాన సూత్రధారి కోటేశ్వరరావు పేరు లేదంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాన్న (తమ్మినేని కృష్ణయ్య హత్య) హత్యకు కోటేశ్వరరావు కుట్ర చేసారని పోలీసులకు ఫిర్యాదు చేశాము. కానీ.. కోటేశ్వరరావు పేరు లేకుండానే రిమాండ్ రిపోర్టు కోర్టులో సమర్పించారని కన్నీరు పెట్టుకున్నారు. ఒత్తిళ్లతోనే కేసులో ప్రధాన సూత్రధారి పేరు లేకుండా చేశారని మండిపడ్డారు. మాకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తమ్మినేని కృష్ణయ్యను ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆగస్టు 15న ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్లో కృష్ణయ్య స్పాట్లోనే మృతి చెందారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఈహత్య జరిగినవిషయం తెలిసిందే.
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
అయితే.. ఆగస్టు 18న తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులు అరెస్టు చేసారు. ఖమ్మం జిల్లా తెల్దార పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకే ఏడుగురు వ్యక్తులు కృష్ణయ్య హత్యలో పాల్గొన్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు. నిందితులన పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా A1 గాఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
CJI NV Ramana: సీజేఐ హ్యాపీడేస్.. ఏఎన్యూలో చదివిన రోజులను గుర్తుచేసుకున్న ఎన్వీ రమణ
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో