Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణా, ఆస్థి నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. నాలాల అంభివృద్ధి చేశారని.. చాల ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పాయని అన్నారు. హుస్సేన్ సాగర్ లో 2 వెల క్యూసెక్కులు కిందకు వదులుతున్నామని అన్నారు. నాలాల దగ్గ్గర ఆక్రమ నిర్మాణాలతో కొన్ని ఇబ్బందులు అయ్యాయని తెలిపారు. ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామన్నారు. రానున్న వారం పాటు వర్షాలు ఉన్నాయనే సమాచారం ఉందని తెలిపారు. వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయాలని కోరారు. వెంటనే సమస్యలు పరిస్కరిస్తున్నామని తెలిపారు.
Read also: Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
426 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా 157 స్టాటిక్ టీంలు రంగంలోకి దిగి నీటిని తొలగించి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించే పనులు చేపడుతున్నారు. 339 వాటర్లాగింగ్ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. డీఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేస్తున్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రొనాల్డ్రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, 15 ప్రాంతాల్లో నీరు నిలిచిందని, మరో రెండు చోట్ల గోడలు కూలిపోయాయని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు.
Brain Chip: బ్రెయిన్లో చిప్.. చివరకు ఏమైందంటే..?
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!