Guru Nanak College: లక్షలు వసూలు చేసి అనుమతి లేదంటున్నారు.. విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guru Nanak College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో కోర్సులకు యూనివర్షటీ రూ.లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన దిగారు. దీంతో గురునానక్ కాలేజీ ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే.. తమకు న్యాయం చేయాలని, తమడబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాధితులు నిరసన చేపట్టారు. అయితే తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసముందు బైఠాయించారు. స్పందిచిన సబితా ఇంద్రారెడ్డి గురునానక్ కాలేజీ విద్యార్థుల బాధితులతో మాట్లాడుతున్నారు. అయితే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడా మంత్రి మాట్లాడునున్నట్లు సమాచారం. కాగా.. ఇటు విద్యార్థులు, అటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడంలో భారీగా పోలీసులు మోహరించారు.
Read also: KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటి?
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
నిన్న వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదన్నారు. యూనివర్సిటీ పేరుతో గురునానక్ కాలేజీ మోసం చేసిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపై లాఠీచార్జి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో చెల్లించామని… ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం కోర్సులకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
Encounter: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం..
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!