AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలో భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ తగిన సాయం అందించి, పూర్తిస్థాయిలో భరోసా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ ఎక్స్ గ్రేషియా అందించేలా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గెజిట్ లేదా సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాకపోయినా, అలాగే అవార్డు పాస్ కాని అర్హులైన యువతకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో 2019 కటాఫ్ డేట్ నుంచి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను కూడా అర్హులుగా గుర్తించారు. వారికి ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు ఇప్పటికే అందించిన పరిహారానికి అదనంగా మొత్తం రూ. 169 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేయనున్నారు. అలాగే.. నిర్వాసిత కుటుంబాలకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్లను కూడా అందించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7,027 నిర్వాసిత కుటుంబాలకు రూ. 905 కోట్ల విలువైన పునరావాస (R&R) ప్యాకేజీని అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ నిర్ణయాల వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇవ్వనంతటి భరోసాను వెలిగొండ నిర్వాసితులకు ఇస్తున్నామని తెలిపారు. అర్హుల జాబితాలో చేర్చాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సుమారు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు, చివరి నిర్వాసితుడికి పరిహారం అందే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపడతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!