TS University: తెలంగాణ వర్సిటీ సెలవులపై విద్యార్థులు ఆందోళన
TS University: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ), పాలక మండలి (ఈసీ) మధ్య విభేదాల కారణంగా రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రగులుతుంది. వర్సిటీకి వీసీ రాకతో స్టాఫ్ రిజిస్ట్రార్ ఛాంబర్ తెరిచినా ఆ స్థానంలో ఎవరూ కూర్చోలేదు. యూనివర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్ను ఆయన ఛాంబర్లో పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, బీవీఎం విద్యార్థి సంఘాల నేతలు చుట్టుముట్టారు. వీసీ, ఈసీ నియామకాల నేపథ్యంలో.. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్ క్యాంపస్లకు జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య రవీందర్ బుధవారం సాయంత్రం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్ ప్రాంగణాలకు జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకింది. విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం తర్వాత వసతి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 9 వరకు తరగతులు ఆన్లైన్లో ఉంటాయని వెల్లడించారు.
వర్సిటీకి ముందుగా మే 31 వరకు వేసవి సెలవులు ఉన్నప్పటికీ, కొత్త విద్యా సంవత్సరం 2023-24 తరగతులను ముందుగానే ప్రారంభిస్తామని మే 18న ప్రకటించారు. కొందరు ఉపాధ్యాయులు విధులకు వస్తున్నా విద్యార్థులు రావడం లేదన్నారు. ఈనేపథ్యంలో ముందుగా తీసుకున్నా నిర్ణయించిన ప్రకారం జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, సెలవులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఏవో కుంటి సాకులు చెబుతూ హాస్టల్ ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలో నెలకొన్న వివాదంపై విద్యార్థుల పోరాటాన్ని విరమించుకునేందుకే వీసీ సెలవులు ప్రకటించారని PDSU, ABVP నాయకులు మండిప్డడారు. హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టాలని గతంలో విన్నవించినా అధికారులు స్పందించలేదని పీడీఎస్యూ నాయకులు ఒక ప్రకటనలో ఆరోపించారు. వీసీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akash Ambani : అంబానీ ఇంట వారసురాలు జననం.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ సీటు వివాదం ముదిరింది. ఈసీ, వీసీ నియమించిన ఇద్దరు రిజిస్ట్రార్లు ఒకేసారి యూనివర్సిటీకి రావడంతో.. గందరగోళం నెలకొంది. రిజిస్ట్రార్ ఎవరనే విషయంపై గొడవ జరగడం చర్చనీయాంశమైంది. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సోమవారం కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరారు. ఆ తర్వాత ఇటీవల వైస్ ఛాన్సలర్ నియమించిన రిజిస్ట్రార్ ప్రొ.కనకయ్య కూడా కార్యాలయానికి వచ్చి ప్రొఫెసర్ యాదగిరిని నిలదీశారు. ఉత్తర్వులు లేకుండా రిజిస్ట్రార్ సీటులో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. రిజిస్ట్రార్గా కొనసాగాలని వీసీ రవీందర్గుప్త ఉత్తర్వులు ఇచ్చారని, తానే ఆ పదవిలో ఉంటానని కనకయ్య తెలిపారు. అయితే రిజిస్ట్రార్గా కొనసాగాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారని ప్రొ.యాదగిరి వివరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాజీకి ప్రయత్నించారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగాయి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు కూడా వేర్వేరు వర్గాలుగా విడిపోయి ఇద్దరు రిజిస్ట్రార్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. రిజిస్ట్రార్ విషయంలో వీసీ, ఈసీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా రిజిస్ట్రార్గా ఉండాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు తరగతులు నిర్వహించవద్దని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు సీనియర్ అధ్యాపకులు జోక్యం చేసుకుని రిజిస్ట్రార్, ఈసీ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఇదిలా ఉండగా ఈసీ, వీసీల మధ్య జరుగుతున్న వాగ్వాదంతో ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
Akash Ambani : అంబానీ ఇంట వారసురాలు జననం.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!