కరీంనగర్ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలో బాయిలర్ కోళ్లు వింత వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఎదిగిన కోళ్లు విక్రయించే సమయంలో వేలల్లో చనిపోవడంతో పౌల్ట్రీ ఫారం యజమానులు తీవ్రంగా నష్టపో తున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వింత వ్యాధులు నుండి కోళ్లను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉపాధిగా వందల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఏర్పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. అయితే వింత రోగాలతో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో పెంపకందార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కోడి పిల్ల ధర 25 రూపాయలులు ఉండగా కిలో కోడికి 112 రూపాయలు ధర ఉంది. రెండు కిలోల బరువు పెరగాలంటే 45 రోజులు కోళ్లకు దాన ఇవ్వాల్సి ఉంటుంది.
read also : నేడు షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ఇక ఒక కోడి నాలుగు కిలోలు దాన తింటూ ఉండగా కిలో దానా ముప్పై మూడు రూపాయల చొప్పున 132 రూపాయలు అవుతుంది. మందులుకి పది రూపాయలు మరో పది రూపాయలు నిర్వహణ ఖర్చు అవుతుంది. కోడి పిల్ల ధర 25 రూపాయలు ఉండగా మొత్తం ఖర్చు 175 రూపాయలు అవుతుంది..రెండు కిలోల కోడి రెండు వందల ఇరవై నాలుగు రూపాయల ఉండటంతో కొంత గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా తరుణంలో అకారణంగా కోళ్లు చనిపోతుండటంతో పెంపకందారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
గడిచిన నాలుగు నెలలుగా 80శాతం కోళ్లు.. వింత వ్యాధులతో మృతి చెందాయి.దీంతో ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో కోళ్లఫారాలు యజమానులు ఆవేదన చెందుతున్నారు.. చనిపోయిన కోళ్లను ప్రత్యేక స్థలాల్లో గుంతలు తవ్వి పూడ్చి పెడుతున్నారు. గతంలో కరోనా సమయంలో భారీగా నష్టం వాటిల్లగా మరోసారి వింత వ్యాధులు కోళ్ల ఫారాలపై ఎఫెక్ట్ పడింది.45 రోజులు పెంచిన తర్వాత కోళ్లు అమ్మే టైంలో మృత్యువాత పడుతున్న సమయంలో పౌల్ట్రీ పరిశ్రమ కరీంనగర్ జిల్లాలో కుదేల వుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ధర ఉన్న కోళ్లు మృత్యువాత పడటంతో వేలాదిగా చనిపోతుం డటంతో కోళ్ల ఫారాలు బంద్ చేసుకుంటామంటున్నారు పౌల్ట్రీ ఫారం యజమానులు.
- Tags
- chiken
- karimnagar
తాజావార్తలు
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!