Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Says First PD Act Filed On Adulterated Liquor: కల్తీ మద్యంపై మొట్టమొదటి పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జార్ఖండ్కు చెందిన రాజారామ్ సింగ్ హర్యానా నుండి తీసుకువచ్చిన 330 బాటిల్స్ను సీజ్ చేశామని అన్నారు. ఆ మద్యాన్ని ల్యాబ్లో పరిశీలించగా అది నకిలీ మద్యం అని తేలిందని.. దీంతో రాజారామ్పై పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకొచ్చి.. హైదరాబాద్లో విదేశీ మద్యం పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నారని వివరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే.. ఆ మద్యాన్ని తరలించే ట్రాస్పోర్ట్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచుతామని, చెక్పోస్ట్లను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఇదే సమయంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాబోయే క్యాబినెట్ మీటింగ్లో క్రీడా పాలసీ ప్రకటిస్తామన్నారు. క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కచ్ఛితంగా అమలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. మూడు రకాల క్రీడలను ఒకే రోజు నిర్వహిస్తున్నామని.. సంబరాలుగా కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. స్కేటింగ్, సైకిలింగ్, రెజ్లింగ్ పోటీలు పెడతామన్నారు. ఈ పోటీల్లో మొత్తం 2500 మంది క్రీడాకారుల పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా.. ఈ క్రీడా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఆంజనేయ గౌడ్ విడుదల చేశారు.
Chennai Crime: హారన్ కొట్టిన పాపానికి ఆటో డ్రైవర్ హత్య.. ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!