Srinivas Goud: కిషన్ రెడ్డి బహిరంగంగా కవితకు క్షమాపణలు చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Demands Kishan Reddy To Say Sorry To Kavitha: ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ అడిగిన ఫోన్లను కవిత విచారణకు తీసుకెళ్లారని.. ఇప్పుడు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇందుకు ఆయన బహిరంగంగా కవితమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలను గౌరవిస్తాం అని గొప్పలు చెప్తారు.. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారు?’’ అని నిలదీశారు. ‘మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేక భ్రమించి మాట్లాడుతున్నారా’ అని ఫైర్ అయ్యారు.
Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఒక ఆడబిడ్డను లేని పోని మాటలతో కించపరిచారని.. మహిళ గోప్యత, ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. విచారణకు ముందే, ఫోన్ల విషయం ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని.. అడ బిడ్డపై ప్రతాపం చూపెడతారా? అంటూ ధ్వజమెత్తారు. వేల కోట్లు ఎగవేసిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానీలు ఎక్కడ వెళ్లారని.. వాళ్ల స్కాంలపై విచారణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీ మిత్రులను వదిలేసి.. తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేశారని ఆరోపించారు. ఆడపిల్ల అని కనికరం లేకుండా.. గంటలు గంటలుగా విచారణ జరిపారని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తప్పుడు ఆధారాలు సృష్టించి, అప్రతిష్ట పాలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉగాది పండుగ ఉందనే కనికరం కూడా లేదని.. మీకు తగిన శాస్తి, పాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారన్న ఆయన.. తాము బెదిరింపులకు ఏమాత్రం భయపడమని తెగేసి చెప్పారు.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!