Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explore to Expand: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ (E2E)’ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ వేదిక ద్వారా తెలంగాణలోని వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు, స్టార్టప్లు, నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించి ప్రపంచ స్థాయిలో విస్తరించే అవకాశాలు కల్పించబడతాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని అన్నారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్గా నిలబెట్టడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్న సందీప్ కుమార్ మక్తాలాను ఈ సందర్భంగా మంత్రి అభినందిస్తూ, తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చేర్చే మంచి ప్రయత్నమని ప్రశంసించారు. ఈ సిరీస్లో భాగంగా మొదటి అంతర్జాతీయ మిషన్ సింగపూర్లో మే 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, అంతర్జాతీయ నెట్వర్కింగ్, మార్కెట్ అవగాహనపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తదుపరి దశలో ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మిషన్లు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ సిరీస్గా విస్తరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ (E2E) అనేది అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే ఒక సమగ్ర కార్యక్రమం. ఇందులో బిజినెస్ డెలిగేషన్లు, ఎగుమతి ప్రోత్సాహక పర్యటనలు, విద్యార్థుల గ్లోబల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్లు, ఇంటర్న్షిప్ అవకాశాలు, వ్యూహాత్మక నెట్వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ వేదిక స్థానిక ప్రతిభను అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానించే వంతెనగా పనిచేస్తుంది.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు 2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా నిర్ణయించారు. ముఖ్యంగా ఎగుమతిదారులు, విద్యార్థులపై దృష్టి పెట్టి వారిని ప్రపంచ మార్కెట్లలో ప్రవేశం కల్పించేందుకు పలు దేశాల్లో ఎక్స్ప్లోరేటరీ మిషన్లు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రస్తుతం సుమారు $19 బిలియన్కు పైగా ఎగుమతులు సాధిస్తూ దేశంలో ప్రముఖ రాష్ట్రంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థికాభివృద్ధి దిశగా ఈ E2E కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి, సెక్రటరీ యామిని మద్దుకూరి, కేశవ్ సోని తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?