MLC Kavitha: స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరాశకు గురయ్యానని, ఇలాంటి అజ్ఞానం చూడటం దారుణమని అన్నారు. నెలసరి సెలవులపై వేతనంతో కూడిన సెలవును నిరాకరించడం మహిళల అసలు బాధను విస్మరించడమేనన్నారు. నెలసరి ఒక ఎంపిక కాదు అని చెప్పబడింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఉదయం తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం బాధాకరమన్నారు. ఆమె ఒక మహిళగా, అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా ఉందని తెలిపారు.
ఎందుకంటే మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదని, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిదని పేర్కొన్నారు. మహిళలకు రుతుస్రావం అనేది ఒక ఎంపిక కాదన్నారు. అది బయోలాజికల్ రియాలిటీ అని తెలిపారు. దీనిక్కూడా వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరిస్తుందని తెలిపారు. అయితే.. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల సహానుభూతి లేకపోవడం.. ప్రతిదానికీ మనం చేయాల్సిన పోరాటాన్ని చూడటం బాధాకరమని తెలిపారు కవిత. విధాన రూపకల్పనకు.. వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని సహానుభూతి.. హేతుబద్ధతతో పూడ్చాల్సిన సమయం ఆసన్నమైందని కవిత ట్వీట్ చేశారు.
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
Read also: Aadi Sai Kumar: పాన్ ఇండియా సినిమా ‘రుధిరాక్ష’ గ్రాండ్ లాంచ్…
అసలు ఏం జరిగింది?
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఎంపీ మనోజ్ కుమార్ ఝా గురువారం రాజ్యసభలో మాట్లాడారు. నెలసరి సెలవులను తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని యాజమాన్యాలు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆమె మట్లాడుతూ.. వేతనంతో కూడిన రుతుస్రావ సెలవుల విధానాన్ని వ్యతిరేకించారు. నెలసరి అనేది శ్రామిక శక్తిలో మహిళలకు వివక్షకు దారితీస్తుందని అన్నారు. రుతుచక్రం ఒక వైకల్యం కాదన్నారు. మహిళల జీవిత ప్రయాణంలో సహజమైన భాగమన్నారు. దీనికి మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుందని తెలిపారు. నెలసరి సెలువులు ఇవ్వాల్సి రావడం వల్ల కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవని తెలిపారు. అయితే దీని వల్ల మహిళలకు ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో ఇరానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. వీటిపై మహిళా లోకం మండిపడుతున్నారు.
Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023
Aadi Sai Kumar: పాన్ ఇండియా సినిమా ‘రుధిరాక్ష’ గ్రాండ్ లాంచ్…
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..